ఎంసెట్ విషయంలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
By: Sankar Thu, 29 Oct 2020 5:53 PM
ఎంసెట్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి.
దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని హైకోర్టు జేఎన్టీయూని ఆదేశించింది.ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్.. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది.
దీంతో ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధిపొందనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు