Advertisement

రేపు అర్ధరాత్రి వరకు మద్యం షాపులకి పర్మిషన్

By: Sankar Wed, 30 Dec 2020 3:55 PM

రేపు అర్ధరాత్రి వరకు మద్యం షాపులకి పర్మిషన్


తెలంగాణ ప్రభుత్వం బుధవారం మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. న్యూ ఇయర్‌ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్‌లకు రేపు(డిసెంబర్‌ 31) అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడంతో నూతన సంవత్సరం వేడుకలపై నిషేధాజ్ఞలు కొనసాగాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మద్యం షాపులు తెరిచే ఉండడమనేది మందుబాబులకు గుడ్‌న్యూస్‌ అనే చెప్పొచ్చు. అయితే మద్యం షాపులతో పాటు పబ్‌లు, బార్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement