Advertisement

  • తెలంగాణ సర్కార్ నిర్ణయం : డిగ్రీ కాలేజీల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పధకం

తెలంగాణ సర్కార్ నిర్ణయం : డిగ్రీ కాలేజీల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పధకం

By: Dimple Fri, 17 July 2020 4:24 PM

తెలంగాణ సర్కార్ నిర్ణయం : డిగ్రీ కాలేజీల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పధకం


ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి వెళ్లిపోతున్నారని.. దీనివల్ల డ్రాప్‌ఔట్స్‌ శాతం పెరిగిపోతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

డ్రాప్‌ఔట్స్‌ శాతాన్ని తగ్గించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల విద్యార్థుల కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాజాగా సీఎం కేసీఆర్‌ దరికి చేరిన ఓ సంఘటన ఈ నిర్ణయానికి కారణమైంది. అదేమిటంటే..
జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు సంబంధించిన చర్చ జరిగిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.లక్ష్మారెడ్డి, స్థానిక ప్రభుత్వ లెక్చరర్‌ రఘురామ్‌ తమ సొంత నిధులతో జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ భోజనం పెడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు. ఆ సందర్భంలో వారిని అభినందించడంతో పాటు అన్నీ ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

అలాగే విద్యావ్యవస్థ ప్రక్షాళనకు సిద్ధమని నిన్న సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అలాగే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే విద్య పేరిట జరిగే దోపిడీని అరికట్టవచ్చనే భావనలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు.


Tags :
|

Advertisement