ఇక మీదట అన్ని జిల్లాలలో కరోనా సెంటర్లు ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
By: Sankar Wed, 02 Sept 2020 11:18 AM
ఒకవైపు తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే , మరోవైపు ప్రభుత్వం కరోనా నిర్ములనలో తీవ్రంగా కృషి చేస్తుంది..ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రమే అత్యధిక కరోనా సెంటర్ లు ఉండగా ఇక నుంచి అన్ని జిల్లాలలో కరోనా సెంటర్లు ఏర్పాటు చేయనుంది..కరీంనగర్ మంథనీలోని జేఎన్టీయూ కాలేజి, వరంగల్ పరకాలలోని పాలిటెక్నిక్ కాలేజి, ఖమ్మంలోని శారద ఇంజనీరింగ్ కాలేజీ సహా పలు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ప్రభుత్వం కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కరోనాపై అవగాహన రావడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు పలువురు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ కరోనాకు చికిత్స పొందుతున్నారు. అలాంటివారికి ప్రభుత్వం కరోనా కిట్లను అందిస్తోంది. అయితే స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవారు, ఇంట్లో సరైన వసతి లేనివారు కోవిడ్ కేంద్రాల్లో ఉండొచ్చని అధికారులు తెలిపారు..
కరోనాపై అవగాహన రావడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు పలువురు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ కరోనాకు చికిత్స పొందుతున్నారు. అలాంటివారికి ప్రభుత్వం కరోనా కిట్లను అందిస్తోంది. అయితే స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవారు, ఇంట్లో సరైన వసతి లేనివారు కోవిడ్ కేంద్రాల్లో ఉండొచ్చని అధికారులు తెలిపారు