Advertisement

నీట్ లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

By: Sankar Fri, 16 Oct 2020 10:22 PM

నీట్ లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు


జాతీయ అర్హ‌త ప్ర‌వేశ ప‌రీక్ష‌(నీట్‌-2020) ఫ‌లితాల్లో తెలంగాణ యువ‌తి స‌త్తా చాటింది. శుక్ర‌వారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో హైద‌రాబాద్‌కు చెందిన తుమ్మ‌ల స్నితిక అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకును సాధించింది. అమ్మాయిల కేట‌గిరిలో రెండ‌వ ర్యాంకు. 720 మార్కుల‌కు గాను 715 మార్కులు వ‌చ్చాయి.

మ‌రో తెలంగాణ విద్యార్థి అనంత ప‌రాక్ర‌మ బి నూక‌ల 710 మార్కులు సాధించి ఆలిండియా 11వ ర్యాంకును ద‌క్కించుకున్నారు. రాష్ర్టానికి చెందిన ఏడుగురు విద్యార్థులు టాప్‌-50 ర్యాంకులో ఉన్నారు. వివ‌రాల ప్ర‌కారం రాష్ర్టం నుంచి 54,872 మంది అభ్య‌ర్థులు నీట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50,392 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

కాగా దేశ‌వ్యాప్తంగా నీట్‌కు 15,97,435 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,66,945 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. జాతీయ‌స్థాయిలో ఒడిశా విద్యార్థి సోహెబ్ అఫ్తాబ్ ఆలిండియా టాప‌ర్‌గా నిలిచాడు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో సోహెబ్ అఫ్తాబ్ 99.99 శాతం మార్కుల‌ను సాధించాడు.

Tags :
|
|

Advertisement