Advertisement

  • నాయిని కుటుంబంలో మరొక తీవ్ర విషాదం ...నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత

నాయిని కుటుంబంలో మరొక తీవ్ర విషాదం ...నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత

By: Sankar Tue, 27 Oct 2020 04:47 AM

నాయిని కుటుంబంలో మరొక తీవ్ర విషాదం ...నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత


తెలంగాణ మాజీ హోమ్ శాఖ మంత్రి, తెరాస నేత నాయిని నర్సింహా రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారన్న సంగతి తెలిసిందే. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఆయన మరణించారు.

వారం రోజుల క్రితం ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయన అంత్యక్రియల సమయంలో కూడా అనారోగ్యంతో అపోలోలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అహల్య తన భర్తను చూసేందుకు వీల్ ఛైర్ లో వచ్చారు.

భర్తను కడసారి చూసేందుకు హాస్పిటల్ నుండి మినిస్టర్ క్వార్టర్స్ కు ప్రత్యేక అంబులెన్స్ లో ఆమెను తీసుకువచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ సమయంలో ఆ ఘటన చూపరులకు కంట తడి పెట్టించింది. అయితే తాజాగా ఆమె కూడా కన్ను మూశారు. కొద్ది సేపటి క్రితం ఆమె అపోలోలో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు.

నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్యారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. నాయిని కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యా దవ్‌, ఈటల రాజేందర్‌, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు తదితరులు సంతాపం తెలిపారు. నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Tags :
|

Advertisement