Advertisement

తెలంగాణ ఈసెట్ ఆగష్టు 31 న

By: chandrasekar Fri, 21 Aug 2020 09:21 AM

తెలంగాణ ఈసెట్ ఆగష్టు 31 న


తెలంగాణ ఈ సెట్‌ ఆగష్టు 31 న నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 31న తెలంగాణ ఈ సెట్‌ను నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ మంజూర్‌ హుస్సేన్‌ ప్రకటించారు. రెండు సెషన్‌లో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించడానికి పరీక్షా కేంద్రాలను గుర్తించి తగు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 56 కేంద్రాలను ఏర్పాటు చేశామని, తెలంగాణకు 54 సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు సెంటర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతలలో నివసించే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో టీఎస్ ఈ-సెట్ 2020 కోసం శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్ధులు కొత్త హాల్ టిక్కెట్లను ఈ నెల 25వ తేదీ నుంచి వెబ్ సైట్ లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, అప్‌డేట్స్‌ కోసం టీఎస్‌-ఈసెట్‌ అధికారిక వైబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్‌ సూచించారు. అభ్యర్థులందరూ బాగా శిక్షణ పొంది పరీక్షల్లో విజయం సాధించాలని కోరారు.

Tags :
|

Advertisement