Advertisement

  • తెలంగాణ ఎంసెట్‌ టాప్ 10 ర్యాంకర్లు...అయిదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చోటు

తెలంగాణ ఎంసెట్‌ టాప్ 10 ర్యాంకర్లు...అయిదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చోటు

By: chandrasekar Wed, 07 Oct 2020 1:57 PM

తెలంగాణ ఎంసెట్‌ టాప్ 10 ర్యాంకర్లు...అయిదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చోటు


రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌లు సైతం ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరుకాగా, 89,734 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబిత వెల్లడించారు. తెలంగాణ నుంచి జేఈఈ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి హార్దిక్‌ రాజ్‌పాల్ తెలంగాణ ఎంసెట్ 2020 పరీక్షలో ఐదవ ర్యాంకు సాధించాడు. సాయితేజ వారణాసి తెలంగాణ ఎంసెట్ టాపర్‌గా నిలిచాడు. తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలలో ఏపీ విద్యార్థులు సైతం సత్తా చూపారు. టాప్ 5 లో ఇద్దరు ఏపీ విద్యార్థులు నిలవగా, మొత్తంగా టాప్ 10లో అయిదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.

తెలంగాణ ఎంసెట్‌ 2020 టాప్ 10 ర్యాంకర్లు...

1. సాయితేజ వారణాసి....(హైదరాబాద్, తెలంగాణ)
2. కె. యశ్వంత్‌ సాయి....(పశ్చిమ గోదావరి, ఏపీ)
3. టి. మణివెంకట కృష్ణ....(తూర్పు గోదావరి, ఏపీ)
4. చాగరి కౌశల్ కుమార్ రెడ్డి....(హైదరాబాద్, తెలంగాణ)
5. హార్దిక్‌ రాజ్ పాల్...(హైదరాబాద్, తెలంగాణ)
6. నాగెల్లి నితిన్ సాయి...(నల్గొండ, తెలంగాణ)
7. తవ్వ ఈ.డి.ఎన్.వి.ఎస్‌. కృష్ణ కమల్...(కృష్ణా, ఏపీ)
8. అన్నం సాయివర్ధన్...(రంగారెడ్డి, తెలంగాణ)
9. వి. సాయి పవన్ హర్షవర్ధన్...(గుంటూరు, ఏపీ)
10. వారణాసి వచన్ సిద్దార్థ్...(విశాఖపట్నం, ఏపీ)

Tags :
|

Advertisement