Advertisement

  • సీఎం స‌హాయ‌నిధికి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విరాళం

సీఎం స‌హాయ‌నిధికి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విరాళం

By: chandrasekar Thu, 22 Oct 2020 3:07 PM

సీఎం స‌హాయ‌నిధికి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విరాళం


హైద‌రాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నష్టం జరిగింది. ఈ నేపధ్యంలో ఎన్నో సంస్థలు, ఎందరో నటులు సీఎం స‌హాయ‌నిధికి ఎన్నో లక్షలు విరాళాలు ప్రకటించారు. అలాగే రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు మూల వేతనాన్ని సీఎం స‌హాయ‌నిధికి అందించాయి.

హైద‌రాబాద్‌లో వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ చ‌ర్య‌ల కోసం ఉద్యోగ సంఘాలు విరాళం ప్ర‌క‌టించాయి.

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో తమ ఒక్కరోజు మూల వేతనాన్ని సుమారు 33 కోట్ల రూపాయలను రాష్ర్ట‌ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Advertisement