Advertisement

దసరా నుంచి ధరణి పోర్టర్ ప్రారంభం...!

By: Anji Mon, 19 Oct 2020 11:45 AM

దసరా నుంచి ధరణి పోర్టర్ ప్రారంభం...!

తెలంగాణ రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆధారంగా మారనున్న ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) దసరా రోజు ప్రారంభించనున్నారు. ప్రజలు విజయదశమిని శుభదినంగా భావిస్తారు.

కాబట్టి దసరా రోజు పోర్టర్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. అప్పటి వరకు ధరణి పోర్టల్ కు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్‌సైట్‌లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దసరా నుంచి అంటే, ఈనెల 25వ తేదీన ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది.

ఆ రోజు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో జరుగుతుతాయి. అయితే తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లను మాత్రమే చేయడానికి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చారు.

ఆ మేరకు భూముల విక్రయాలకు సంబంధించిన సేల్‌ డీడ్‌, కుటుంబసభ్యులు/ఇతర భూముల యాజమానులు పంచుకునే పార్టిషన్‌, కటుంబసభ్యులు సమర్పించే సక్సెషన్‌ (వారసత్వ) డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌లు చేయడానికే తహసీల్దార్లకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

శనివారం ధరణి(వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌)పై తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ, స్థానిక సంస్థలు), కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా.. కొన్నింటికీ యంత్రాంగం జవాబు ఇచ్చింది.

ధరణి పోర్టల్‌ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని సోమేశ్‌కుమార్‌ అన్నారు. శనివారం పోర్టల్‌ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్లు రేపటి కల్లా కనీసం పది లావాదేవీలను ప్రయోగాత్మకంగా పూర్తి చేయాలని సూచించారు.

ధరణి సేవలకు అంతరాయం కలుగకుండా చూసేందుకు డిస్కమ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టీఎస్‌టీఎస్‌ ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

Tags :
|

Advertisement