Advertisement

  • ఢిల్లీలో సోనియా గాంధీ తో భేటీ అయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ఢిల్లీలో సోనియా గాంధీ తో భేటీ అయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

By: Sankar Wed, 16 Dec 2020 12:56 PM

ఢిల్లీలో సోనియా గాంధీ తో భేటీ అయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి


తెలంగాణ టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే..దుబ్బాకలో , జిహెచ్ఎంసి లో కాంగ్రెస్ ఘోర ఓటమితో పార్టీలో ప్రక్షాళనకు రంగం సిద్ధం అయింది..ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది ..రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరికీ వారే పీసీసీ చీఫ్ కోసం అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు..

ఇందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోనియా గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని సోనియా గాంధీని కోరారు. కోమటిరెడ్డితో పాటు అనేక మంది నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఎవరికి ఆ పదవిని అప్పగిస్తారు అన్నది మరికొని రోజుల్లోనే తేలిపోతుంది.

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ నాలుగు రోజులపాటు తెలంగాణలోనే ఉండి నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అభిప్రాయాల నివేదికను మాణిక్యం ఠాకూర్ సోనియా గాంధీకి అందజేశారు

Tags :
|

Advertisement