Advertisement

  • తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రారంభం అయింది ..మాణిక్యం ఠాగూర్

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రారంభం అయింది ..మాణిక్యం ఠాగూర్

By: Sankar Mon, 14 Dec 2020 8:48 PM

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రారంభం అయింది ..మాణిక్యం ఠాగూర్


తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు.

తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు.

సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానని వెల్లడించారు. ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని ఠాగూర్‌ చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Tags :
|
|
|

Advertisement