Advertisement

  • ప్రధాని మోడీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం కెసిఆర్

ప్రధాని మోడీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం కెసిఆర్

By: Sankar Wed, 09 Dec 2020 12:58 PM

ప్రధాని మోడీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం కెసిఆర్


కేంద్రంలో కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే...ఆ కొత్త పార్లమెంట్ కు ఈ నెల పదిన ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే...అయితే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రధాని మోడీకి లేఖ రాసారు .ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఈ లేఖ గురించి ఎక్కువగా చర్చనీయాంశం అయింది...

ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణాలో తెరాస కు ప్రధాన ప్రత్యర్థి గా బీజేపీ ఎదుగుతుంది ..దుబ్బాక ఎన్నికలలో విజయం , జిహెచ్ఎంసి ఎన్నికలలో రెండవ స్థానం ఇలా రాబోయే రోజుల్లో తెరాస కు తామే సరైన ప్రత్యర్థి అని బీజేపీ చాటిచెప్పింది ..మరోవైపు సీఎం కెసిఆర్ కూడా బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు ..నిన్న జరిగిన భారత్ బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించాడు ..ఇలాంటి పరిస్థితులలో కెసిఆర్ మోడీకి లేఖ రాయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది...

ఇక లేఖలో వర్చువల్ ద్వారా జరిగే కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు. కొత్త భవన నిర్మాణం వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నానని కేసీఆర్ ఆకాక్షించారు.

Tags :
|
|
|
|

Advertisement