Advertisement

  • సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కెసిఆర్

సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కెసిఆర్

By: Sankar Sun, 06 Dec 2020 06:34 AM

సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కెసిఆర్


సిద్ధిపేట అర్బన్ మండలంలోని పొన్నాల గ్రామంలో నిర్మించిన తెలంగాణ భవన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కానున్నట్లుగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 10న సిద్దిపేట రానున్నారని.. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను, పార్టీ కార్యాలయ భవన ఏర్పాట్లను ఇవాళ పరిశీలించామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా.. సీఎం కేసీఆర్‌ ఈ నెల 7న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

రైతుబంధు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈ ఏడాది రెండో విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ఈ మీటింగ్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :
|
|

Advertisement