Advertisement

  • ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న గులాబీ దళపతి ...ప్రధాని మోడీని కలిసే అవకాశం !

ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న గులాబీ దళపతి ...ప్రధాని మోడీని కలిసే అవకాశం !

By: Sankar Thu, 10 Dec 2020 09:02 AM

ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న గులాబీ దళపతి ...ప్రధాని మోడీని కలిసే అవకాశం !


నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో ప్రధాన పార్టీలు అంటే అందరికి గుర్తొచ్చేది తెరాస , కాంగ్రెస్ ..కొత్తగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత తెరాస అధికారాన్నీ దక్కించుకోగా ఇక అంతకుముందు కాంగ్రెస్ ఎక్కువగా పరిపాలించేది..కానీ గత కొంతకాలంగా తెలంగాణలో పరిస్థితులు మారుతున్నాయి...నార్త్ రాష్ట్రాలలో ఎంత బలంగా ఉన్నప్పటికీ సౌత్ లో తమ పట్టు నిలుపుకోలేకపోతున్న బీజేపీ , అనూహ్యంగా తెలంగాణాలో మెరుగవుతుంది...దీనితో ఇప్పుడు తెలంగాణాలో తెరాస వర్సెస్ బీజేపీ అన్నవిధంగా పరిస్థితులు మారుతున్నాయి..

మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది...తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇప్పటికే తెలంగాణ సీఎంవో.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోరగా.. అది ఖరారైతే, భేటీ ఉంటుందన్నమాట..

ఇక , ప్రదానితో పాటు.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, మరికొందరు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల విషయాన్ని ప్రస్తావించనున్నారు. మరోవైపు.. దేశరాజధానిలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణానికి పూనుకుంది టీఆర్ఎస్.. ఈ పర్యటనలో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Tags :
|
|
|

Advertisement