Advertisement

ఇవాళ మోదీతో భేటీ కానున్న సీఎం కేసిఆర్...!

By: Anji Sat, 12 Dec 2020 09:24 AM

ఇవాళ మోదీతో భేటీ కానున్న సీఎం కేసిఆర్...!

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తెలంగాణ సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.

ప్రధానితో పాటు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీతో కేసీఆర్‌ ఇవాళ సమావేశం కానున్నట్లు తెలిసింది.

విభజన హామీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చిస్తారని సమాచారం. కేసీఆర్ ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే నిన్న ఆయన మొదట కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమైన కేసీఆర్.. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై ప్రముఖంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని అమిత్‌ షాను కేసీఆర్‌ కోరారు.

పోలీసు వ్యవస్థ నవీకరణకు, వెనకబడిన జిల్లాలకు నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు ప్రధాని మోడీ,

Tags :

Advertisement