Advertisement

  • భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కెసిఆర్

భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కెసిఆర్

By: Sankar Sun, 06 Dec 2020 6:36 PM

భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కెసిఆర్


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మద్దతు ప్రకటించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు.

భారత్‌ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల పోరాటం న్యాయబద్ధమైనది, వారి డిమాండ్స్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతినిస్తుందని ఆదివారం ఓ ప్రకటన ద్వారా సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది..

Tags :
|

Advertisement