Advertisement

  • ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సీఎం కెసిఆర్

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సీఎం కెసిఆర్

By: Sankar Sun, 15 Nov 2020 5:20 PM

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సీఎం కెసిఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలలపాటు కోత విధించిన 50శాతం మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం రూ. 130 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలోనేనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులను అభినందించారు. హైదరాబాద్ లో 50శాతం బస్సులను పునరుద్దరించాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదేశించారు.

Tags :
|
|
|

Advertisement