Advertisement

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన తెలంగాణ సీఎం కెసిఆర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన తెలంగాణ సీఎం కెసిఆర్

By: Sankar Fri, 11 Dec 2020 9:57 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన తెలంగాణ సీఎం కెసిఆర్


కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేసీఆర్‌ కోరారు.

వరద సాయంతోపాటు ఇతర కీలక అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. సుమారు 45 నిమిషాల పాటు చర్చలు సాగాయి. రేపు (శనివారం) కూడా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌ ఉండనున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం..

కాగా తెలంగాణాలో గత కొంతకాలంగా తెరాస కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన విషయం తెలిసిందే ..దుబ్బాక ఉప ఎన్నికలో విజయం , జిహెచ్ఎంసి ఎన్నికలలో భారీగా సీట్లు సాధించి బీజేపీ ఒక్కసారిగా రేస్ లోకి వచ్చింది ..ఇదే సమయంలో తెరాస కూడా బీజేపీ మీద తీవ్రంగానే విమర్శలు చేసింది ..ఈ నేపథ్యంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది...

Tags :
|
|
|

Advertisement