ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...!
By: Anji Sun, 13 Dec 2020 6:53 PM
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరబాద్కు బయలుదేరారు.
శనివారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఏకాంతంగా చర్చించారు సీఎం కేసీఆర్.
తక్షణ వరద సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు.
నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇవ్వాలని, నిధులు మంజూరుచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతకుముందు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిని కలిశారు.
సిద్దిపేట సహా ఆరు విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. శుక్రవారం కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు.
నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హోంమంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు.