Advertisement

  • నాగార్జునసాగర్‌ లో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది - బండి సంజయ్

నాగార్జునసాగర్‌ లో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది - బండి సంజయ్

By: Anji Sun, 20 Dec 2020 9:47 PM

నాగార్జునసాగర్‌ లో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది - బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను ఆయన ఎందుకు కలవలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు.

కేసీఆర్ అరాచక, అవినీతిపాలన అంతమయ్యేవరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు. అమరవీరుల ఆశయాలను తుంగలో తొక్కిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని అన్నారు.

రాష్ట్ర మంత్రులకు సీఎం వద్ద అపాయిమెంట్ లేదు కానీ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే ఆయనపై విమర్శలు చేశారు.

రాబోయే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కూడా బీజేపీనే గెలుస్తుందని బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీ కూడా బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రైతులను లక్షాధికారులను చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని, దేశం కోసం పోరాటం, త్యాగాలు చేసేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో పండించిన పంటను ఎవరికి అమ్మారో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ ఫాం హౌస్‌లో దొడ్డు వడ్లు పండించి లాభం పొందారని, రైతులను సన్నాలు పండించమని ముంచాడని మండిపడ్డారు. కచ్చితంగా రెచ్చగొడతా.. రెచ్చిపోయేలా చేస్తానని స్పష్టం చేశారు. 80 శాతం ఉన్న హిందువుల కోసం పనిచేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

Tags :

Advertisement