Advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్

By: Sankar Mon, 22 June 2020 2:33 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్



తెలంగాణాలో ఒకవైపు పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు తెరాస ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ..బీజేపీ జాతీయ నాయకుడు జెపి నడ్డా తెలంగాణాలో కరోనా టెస్టులు ఎక్కువ చేయడం లేదు విమర్శలు గుప్పించడంతో , తెరాస సర్కార్ జెపి నడ్డా పైన ఎదురు దాడికి దిగింది ..హరీష్ రావు , ఈటెల రాజేందర్ వంటి నాయకులు బీజేపీ విమర్శలను తిప్పి కొట్టారు ..

తాజాగా కోఠిలోని కరోన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు..

తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చాం. నిన్న టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు. ఇక్కడ ఎన్ని చేశారో చెప్పాలి. మన సీఎం పారసీటమాల్ ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు జోకర్ల లాగా మారారు. హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారు అని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement