Advertisement

  • ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ..

ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ..

By: Sankar Thu, 16 July 2020 3:00 PM

ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ..



కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం ఉస్మానియా హాస్పిటల్‌ను సందర్శించారు. వర్షం కారణంగా ఉస్మానియా హాస్పిటల్‌ జలమయమైందని మీడియాలో వార్తలు వెలువడిన వేళ.. ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి హాస్పిటల్‌ను సందర్శించిన ఆయన.. అక్కడి పరిస్థితుల గురించి అధికారులతో మాట్లాడారు. మురుగునీరు చేరి సిబ్బంది, రోగులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.

మొన్న కురిసిన వర్షం వల్ల హాస్పిటల్ మొత్తం జలమయమైంది. పేషెంట్లు, డాక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ చాలా మంది డాక్టర్లున్నారు, వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బెడ్ల మీద పేషెంట్లు, కింద నీళ్లు ఉన్నాయి. హాస్పిటల్‌లో ఉన్నామా లేదంటే నడి రోడ్డు మీద ఉన్నామా అనే దౌర్భాగ్య పరిస్థితి. ఉస్మానియాకు పేద, మధ్యతరగతి ప్రజలే వస్తుంటారు. ఈ హాస్పిటల్‌ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం మీద కేసులు వేశారు, సచివాలయం మీద కేసులను వేశారు. వాటిని అడ్డుకున్న కేసీఆర్.. ఉస్మానియా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు. పేదల పొట్టకొట్టి, పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సీఎంకు పేదలు తప్పకుండా గుణపాఠం చెబుతారు’’ బీజేపీ నేతలు హెచ్చరించారు.

Tags :
|
|
|

Advertisement