Advertisement

  • ఎలక్షన్ కమీషనర్ రాజీనామా చేయాలి ...తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

ఎలక్షన్ కమీషనర్ రాజీనామా చేయాలి ...తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

By: Sankar Fri, 04 Dec 2020 1:30 PM

ఎలక్షన్ కమీషనర్ రాజీనామా చేయాలి ...తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గ్రేటర్‌ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని.. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ వేసిందని.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని హెచ్చిరించారు.

ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందని.. EC, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకుందన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది ..

అడ్డదారుల్లో గెలవాలని చూసిన టిఆర్ఎస్ పార్టీ కి ఇది చెంపపెట్టు అన్నారు. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని...లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని.. లేకపోతే ప్రజలే ఈ కెసిఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని హెచ్చిరించారు.

Tags :
|

Advertisement