Advertisement

  • సీఎం కెసిఆర్ పై మరొకసారి తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

సీఎం కెసిఆర్ పై మరొకసారి తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

By: Sankar Mon, 28 Dec 2020 2:19 PM

సీఎం కెసిఆర్ పై మరొకసారి తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్


నియంత్రిత పంటల సాగు విధానాన్ని తీసుకువచ్చిన తెరాస ప్రభుత్వానికి రైతులనుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం అయ్యాయి..దీనితో ఈసారి నియంత్రిత పంటల సాగు విధానానికి స్వస్తి పలుకుతున్నామని సీఎం కెసిఆర్ తెలిపారు..ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని.. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి పంటల కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నియంత్రిత సాగు నిర్ణయంపై బీజేపీ నేతలు విజయశాంతి, బండి సంజయ్.. కేసీఆర్‌పై మండిపడ్డారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి మరొకసారి తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అనుభవంతో చూపించాడు. వ్యవసాయ చట్టాలపైన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. గత నాలుగు నెలలుగా కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై చేసిన విమర్శలు మార్చుకొని కొత్త చట్టాలకు కితాబు ఇవ్వడాన్ని బిజెపి స్వాగతిస్తోంది అని అన్నారు..

Tags :
|
|

Advertisement