Advertisement

  • దివంగత ప్రధాని పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం..

దివంగత ప్రధాని పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం..

By: Sankar Tue, 08 Sept 2020 2:03 PM

దివంగత ప్రధాని పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం..


తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం... దీనికి అనుగుణంగా.. ఇవాళ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు... సభ ప్రారంభమైన వెంటనే పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు..

దేశ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా.. ఇలా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు కేసీఆర్.. పీవీ చేసిన సేవలకు గాను ఆయకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంత్రులు కేటీఆర్ తదితరులు ప్రసంగిస్తూ.. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.. ఆ తర్వాత ఈ తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అయితే, పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ సభలో నిర్వహించిన చర్చకు మాత్రం ఎంఐఎం దూరంగా ఉంది. ఈ చర్చకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇక, తీర్మానం తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

Tags :

Advertisement