Advertisement

  • నితీష్ పై ఉల్లిగడ్డలతో దాడి ..తీవ్రంగా ఖండించిన తేజస్వి యాదవ్

నితీష్ పై ఉల్లిగడ్డలతో దాడి ..తీవ్రంగా ఖండించిన తేజస్వి యాదవ్

By: Sankar Wed, 04 Nov 2020 4:59 PM

నితీష్ పై ఉల్లిగడ్డలతో దాడి ..తీవ్రంగా ఖండించిన తేజస్వి యాదవ్


బిహార్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరువుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మూడో దశ పోలింగ్ నవంబరు 7న జరగనుండగా ఫలితాలు నవంబరు 10న వెలువడనున్నాయి. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి అధికార, ప్రతిపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇదే సమయంలో నేతలకు ఊహించని పరాభవాలు, చెప్పు దెబ్బలు, ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కూటమి నేత తేజస్వీ యాదవ్‌పై చెప్పులు విసిరిన ఘటనలు కలకలం రేపాయి.

తాజాగా, మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్‌పై దుండగులు ఉల్లిగడ్డలు విసిరారు. దీనిపై నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా విసరండి అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై ఉల్లిగడ్డలు విసరడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనకు వలయంగా ఏర్పడటంతో సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. నిందితులను భద్రతా సిబ్బంది పట్టుకున్నా వారి గురించి పట్టించుకోవద్దని నితీశ్ సూచించారు.

అయితే, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తేజస్వీ యాదవ్.. తీవ్రంగా ఖండించారు. నితీశ్‌పై ఉల్లిగడ్డలను విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని.. మన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తామంతా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నామని... ఇలాంటి దాడులు సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నితీశ్‌పై విమర్శలు గుప్పించిన లాలూ తనయుడు.. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటతప్పారని ఆరోపించారు.


Tags :

Advertisement