తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు..తీవ్రంగా మందలించిన హైకోర్టు
By: chandrasekar Sat, 11 July 2020 10:30 AM
గత కొన్ని రోజుల నుంచి
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ
తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం
విచారించిన హైకోర్టు పిటిషనర్ను తీవ్రంగా మందలించింది.
రాజకీయ జిమ్మిక్కులు
మానుకోవాలని పిటిషనర్ని గట్టిగా హెచ్చరించింది. ఈ పిటిషన్ను విచారించలేమని
ధర్మాసనం స్పష్టంచేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్ని
హైకోర్టు ధర్మాసనం తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
ఒకవేళ ముఖ్యమంత్రి
కనిపించని పక్షంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్కు
హైకోర్టు సూచించింది. కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసేలా
ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు
చేశారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యం
గురించి రాష్ట్ర పజలు ఆందోళన చెందుతున్నారని ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని
ధర్మాసనాన్ని కోరిన సంగతి తెలిసిందే.