Advertisement

  • చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్న టీమిండియా...

చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్న టీమిండియా...

By: chandrasekar Mon, 30 Nov 2020 12:45 PM

చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్న టీమిండియా...


టీమిండియా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఆసీస్‌కు భారీ స్కోర్లు ఇచ్చిన కోహ్లి సేన‌.. ఈ క్ర‌మంలో తాను ఆడిన మొత్తం 978 వ‌న్డేల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ప్ర‌త్య‌ర్థి ఓపెన‌ర్లు టీమిండియాపై సెంచ‌రీకిపైగా పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్ప‌డం ఇదే మొదటిసారి.

రెండు వ‌న్డేల్లోనూ ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు వార్న‌ర్‌, ఫించ్ సెంచ‌రీ భాగస్వామ్యం నెల‌కొల్పారు. వీళ్లు తొలి వికెట్‌కు తొలి వ‌న్డేలో 156, రెండో వ‌న్డేలో 142 ప‌రుగులు జోడించారు. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివరి వ‌న్డేలో ఆ టీమ్ ఓపెన‌ర్లు మార్టిన్ గప్టిల్‌, హెన్రీ నికోల్స్ కూడా తొలి వికెట్‌కు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పారు. ఈ సిరీస్‌లో 0-3తో టీమిండియా ఓటమికి గురైంది. 1975 నుంచి వ‌న్డేలు ఆడుతున్న టీమిండియా గ‌తంలో ఎప్పుడూ ఇలా వ‌రుస‌గా మూడుసార్లు ప్ర‌త్య‌ర్థి ఓపెన‌ర్ల‌కు వంద‌కుపైగా భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పే అవ‌కాశం ఇవ్వ‌లేదు.

Tags :
|

Advertisement