ప్రాక్టీస్ మ్యాచ్ లో మెరుగు సెంచరీ తో చెలరేగిన రిషబ్ పంత్
By: Sankar Sun, 13 Dec 2020 09:32 AM
ఆస్ట్రేలియాతో ఈ నెల పదిహేడు నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే..అయితే దానికి ముందు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతూ సాధన చేస్తుంది ..
తొలి ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా కాగా , రెండో వార్మ్ అప్ మ్యాచ్ లో టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది ..ఫామ్ లో లేక జట్టులో స్థానం ఉంటుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్సమెన్ రిషబ్ పంత్ మెరుపు సెంచరీ తో చెలరేగి సెలెక్టర్లకు సందేశాన్ని పంపాడు...
తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఒక్కసారి కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఒక ఎండ్లో విహారి నింపాదిగా ఇన్నింగ్స్ను నడిపిస్తుంటే.. పంత్ మాత్రం తనదైన శైలిలో కంగారూలపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పంత్ 43 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 188 బంతుల్లో విహారి సెంచరీ మార్క్ చేరాడు. ఈ దశలో పంత్ శతకం సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. మరో ఐదు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బౌండ్రీలతో రెచ్చిపోయిన రిషబ్ అజేయ సెంచరీతో రోజును ముగించాడు.