టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
By: Sankar Thu, 17 Dec 2020 09:38 AM
ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధం అయింది ...తొలి టెస్ట్ అడిలైడ్ ఓవల్ మైదానం లో ఈ రోజు ప్రారంభం అయింది ..టాస్ గెలిచినా టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ...
రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇప్పుడు అదే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు అంతే ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి సిరీస్లో తొలి మ్యాచ్లోనే డే నైట్(పింక్ బాల్) ఆడనుంది. టీమిండియాకు ఇది రెండో డై నైట్ టెస్టు మాత్రమే.. అదే ఆసీస్ మాత్రం ఇప్పటికే 7 డే నైట్ టెస్టు మ్యాచ్లు ఆడి అన్నింటా గెలవడం విశేషం.
భారత్ (తుది జట్టు): కోహ్లి (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా.
ఆస్ట్రేలియా (తుది జట్టు): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్.