Advertisement

  • మూడో టెస్టుకు ముందు టీమిండియాకు శుభవార్త ...రేపు జట్టుతో చేరనున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

మూడో టెస్టుకు ముందు టీమిండియాకు శుభవార్త ...రేపు జట్టుతో చేరనున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

By: Sankar Tue, 29 Dec 2020 4:16 PM

మూడో టెస్టుకు ముందు టీమిండియాకు శుభవార్త ...రేపు జట్టుతో చేరనున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ


ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ ను మట్టికరిపించి సంచలన విజయం సాధించింది...రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ , స్టార్ బౌలర్లు ఇషాంత్ , షమీ , స్టార్ ఓపెనర్ రోహిత్ లేకున్నా కూడా రహానే నాయకత్వంలోని టీమిండియా సమిష్టిగా రాణించి ఆస్ట్రేలియాను చిత్తూ చేసింది...దీనితో అడిలైడ్ లో ఎదురయినా పరాభవానికి బదులు తీర్చుకుంది..ఇక ఈ సిరీస్ లో మూడో టెస్ట్ సిడ్నీ లో వచ్చే నెల ఏడునుంచి ప్రారంభం కానుంది..

అయితే గాయం నుంచి కోలుకొని రేపు జట్టుతో కలవనున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అని అభిమానులు ఆసక్తితో ఉన్నారు..కోహ్లీ వంటి ఆటగాడు లేకపోవడంతో అతడి స్థానంలో రోహిత్ వంటి స్టార్ ఆటగాడు జట్టుతో చేరితే జట్టు బలం మరింత పెరుగుతుంది అని అనడంలో సందేహం లేదు..

కాగా రోహిత్ తాను ఆడిన చివరి పర్యటనలో ఓపెనర్ గానే బరిలోకి దిగాడు..దీనితో ఈ సిరీస్ లో కూడా ఓపెనర్ గానే వచ్చే అవకాశం ఉంది..అయితే ఓపెనింగ్ స్లాట్ లో ఇప్పటికే గిల్ , మయాంక్ అగర్వాల్ ఉండటంతో ఎవరిని తొలిగించాలా అన్న సంగిగ్ధంలో టీమిండియా మేనేజ్మెంట్ ఉంది...అయితే రోహిత్ ఎంట్రీ పై రహానే మాట్లాడుతూ రోహిత్ తిరిగి జట్టులోకి రావడం పట్ల మేము సంతోషిస్తున్నాము. నేను నిన్న రోహిత్ తో మాట్లాడాను, అతను జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు" అని రహానే అన్నాడు...

Tags :
|

Advertisement