రెట్రో జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా…!
By: Anji Tue, 24 Nov 2020 10:47 PM
ఆసీస్ సిరీస్లో కొత్త జెర్సీతో భారత ఆటగాళ్లు మెరువనున్నారు. అయితే తాను జెర్సీ వేసుకుని దిగిన ఫొటోను తన ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో ధావన్ పంచుకున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో ఉన్న ధావన్.. జెర్సీతో దిగిన ఫొటోను ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
లుక్ సూపర్ ఉందని అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. 1992లో భారత ఆటగాళ్లు ఇలాంటి జెర్సీతోనే ప్రపంచకప్ బరిలో దిగారు. అదే తరహాలో ఈ జెర్సీ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
భారత్-ఆసీస్ మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది. మొత్తంగా తలో మూడు వన్డేలు, టీ20లు, నాలుగు టెస్టులు ఇరుజట్లు ఆడనున్నాయి.
Tags :