తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా
By: Sankar Mon, 28 Dec 2020 07:40 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు అల్ అవుట్ అయింది..దీనితో తొలి ఇన్నింగ్స్లో కీలక 131 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది...
ఓవర్నైట్ స్కోరు 327/5తో ఈ రోజు ఇన్నింగ్స్ పెట్టిన భారత్కు ఆదిలోనె దెబ్బ తగిలింది. రహానే రనౌట్ కావడంతో జడేజా..అశ్విన్(14)తో కలిసి స్కోర్ బోర్డ్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే స్టార్క్ బౌన్సర్స్తో జడేజాని ఇబ్బంది పెడుతున్న క్రమంలో పుల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు.
ఇక ఉమేష్ యాదవ్(9), బుమ్రా (0), సిరాజ్(0 నాటౌట్) వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ 326 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 131 పరుగుల ఆధిక్యం లభించింది.ఇక మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో రిజల్ట్ తప్పక రానుంది. ఆసీస్ బౌలర్స్ విషయానికి వస్తే స్టార్క్ 3, కమ్మిన్స్ 2, లియాన్ 2, హేజిల్వుడ్ ఒక వికెట్ తీసారు.