స్టార్ ఓపెనర్ రోహిత్ కు ఘన స్వాగతం పలికిన టీమిండియా
By: Sankar Wed, 30 Dec 2020 8:00 PM
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మెల్బోర్న్ హోటల్ రూంలో బుధవారం సాయంత్రం టీమిండియా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ఫిట్నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన రోహిత్ కఠిన క్వారంటైన్ నిబంధనలను పాటించాడు.
తాజాగా బుధవారం సాయంత్రం మెల్బోర్న్లోని హోటల్ రూలంలో ఉన్న టీమిండియా జట్టును కలిశాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా తదితర ఆటగాళ్లు రోహిత్కు ఘనస్వాగతం పలికారు. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రోహిత్తో కాసేపు ముచ్చటించాడు...
అయితే రెండో టెస్ట్ లో ఘనవిజయం సాధించిన టీమిండియా రోహిత్ కోసం ఎవరిని తొలగించాలనే ఆలోచనలో ఉంది..మయాంక్ అగర్వాల్ రెండు టెస్టులో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ మయాంక్ పై వేటు వేసేందుకు టీమిండియా అంత సిద్ధంగా లేదు...క్వారంటైన్ తర్వాత రోహిత్ శర్మ మానసిక స్థితి, మ్యాచ్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు.