క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ...
By: Sankar Wed, 18 Nov 2020 5:30 PM
టీమిండియా మాజీ పేసర్ సుదీప్ త్యాగి 13 ఏళ్ల సుదీర్ఘమైన క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు.
2009లో భారత్ తరపున బరిలోకి దిగిన త్యాగి.. 4 వన్డేలు ఆడి మూడు వికెట్లు తీశాడు. అలాగే శ్రీలంకపై ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అటు డొమెస్టిక్ క్రికెట్లో ఓవరాల్గా 156 వికెట్లు సాధించాడు. ఇకపై ఐపీఎల్లో సుదీప్ త్యాగి 2009, 2010 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
‘ భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే నా కల నెరవేరింది. నా రోల్ మోడల్స్ మహమ్మద్ కైఫ్, ఆర్పి సింగ్, సురేష్ రైనాలకు.. అలాగే నా తొలి వన్డేకు కెప్టెన్గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనికి ధన్యవాదాలు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అయినా తప్పదు ముందుకు సాగిపోవాలి’ అని త్యాగి పేర్కొన్నాడు. కాగా, దేశవాళీ క్రికెట్లో సుదీప్ త్యాగి తన చివరి మ్యాచ్ను 2017లో ఆడాడు.