Advertisement

  • టీమిండియాను వీడని గాయాల బెడద ...గాయంతో మధ్యలోనే వైదొలిగిన ఉమేష్ యాదవ్

టీమిండియాను వీడని గాయాల బెడద ...గాయంతో మధ్యలోనే వైదొలిగిన ఉమేష్ యాదవ్

By: Sankar Mon, 28 Dec 2020 2:00 PM

టీమిండియాను వీడని గాయాల బెడద ...గాయంతో మధ్యలోనే వైదొలిగిన ఉమేష్ యాదవ్


ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి...ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్లు ఇషాంత్ , షమీ గాయాలతో దూరమవగా తాజాగా ఉమేష్ కూడా గాయపడ్డాడు ..ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉమేష్ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు..

కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఉమేష్ ఆస్ట్రేలియా ఓపెనర్ బర్న్స్ వికెట్ తీసుకున్నాడు..మైదానం వీడే సమయంలో ఉమేశ్ యాదవ్ అసౌకర్యంగానే నడుస్తూ కనిపించాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో.. అతని గాయంతో భారత్ జట్టు మేనేజ్‌మెంట్ సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ మిగిలిన రెండు టెస్టులకీ ఉమేశ్ యాదవ్ దూరమైతే..? నవదీప్ సైనీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది...

ఇక రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది...రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది ..చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న ఆస్ట్రేలియా కేవలం రెండు పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది...

Tags :

Advertisement