Advertisement

నిషేధం ముగించుకున్న టీం ఇండియా స్టార్ బౌలర్

By: Sankar Mon, 14 Sept 2020 11:45 AM

నిషేధం ముగించుకున్న టీం ఇండియా స్టార్ బౌలర్


భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ మీద ఉన్న నిషేధం ఆదివారంతో ముగిసింది.. ఐపీఎల్ 2013 సీజన్‌లో స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌పై అప్పట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాలం నిషేధం విధించింది.

అయితే.. శ్రీశాంత్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు సాక్ష్యాధారాల్ని కోర్టు ముందు ఉంచడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దాంతో.. కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించగా.. బీసీసీఐ మాత్రం ఆ నిషేధాన్ని ఎత్తివేయలేదు. అయితే.. సుప్రీంకోర్టుని శ్రీశాంత్ ఆశ్రయించగా.. ఆ నిషేధాన్ని ఏడేళ్లకి అత్యుత్తమ న్యాయస్థానం కుదించింది.

నిషేధం ముగియడంతో ఈరోజు మీడియాతో శ్రీశాంత్ మాట్లాడుతూ ‘‘నాకు స్వేచ్ఛ లభించింది. మళ్లీ నేను మ్యాచ్‌లు ఆడేందుకు ప్రీడమ్ దొరికింది. వ్యక్తిగతంగానూ నాకు ఇది గొప్ప ఉపశమనం’’ అని చెప్పుకొచ్చాడు. కేరళకి చెందిన శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఐపీఎల్‌లోనూ 44 మ్యాచ్‌లాడాడు.

శ్రీశాంత్‌పై తాజాగా నిషేధం ముగియడంతో.. అతను తొలుత రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశవాళీలోనూ రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడినా.. 37 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ టీమిండియాకి ఆడటం అనుమానమే..!

Tags :
|

Advertisement