ఆస్ట్రేలియా ఎ పై ఆధిపత్యం చెలాయించిన టీం ఇండియా
By: chandrasekar Sat, 12 Dec 2020 11:20 AM
టీం ఇండియా ఇప్పుడు
ఆస్ట్రేలియా పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్ డే సిరీస్ మరియు టి20
సిరీస్ ముగియడంతో ఇక టెస్ట్ సిరీస్ మిగిలి వుంది. మొదటి టెస్ట్ ఈ నెల 17 న
ప్రారంభం కానుంది. దీనికి ముందు ఆస్ట్రేలియా ఏ టీం తో మూడు రోజుల ప్రాక్టీస్
మ్యాచ్ నిన్న శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
టెస్ట్ మ్యాచ్ లలో ఈసారి
పింక్ బాల్ తో ఆడనున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ల్లో భారత బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ పింక్ బాల్తో మన బౌలర్లు చెలరేగడంతో
ఆస్ట్రేలియా ఎ పై జరుగుతున్న మూడు రోజుల
మ్యాచ్లో టీమిండియా పట్టుబిగించింది. బౌలర్ల ఆధిపత్యం వల్ల తొలి రోజు ఆటలో మొత్తం 20
వికెట్లు నేలకూలడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియ 194 పరుగులకే
ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎ టీమ్ను 108 పరుగులకే మన బౌలర్లు
కుప్పకూల్చింది.
ఇండియా ఇన్నింగ్స్లో 86 పరుగుల
ఆధిక్యం సంపాదించింది. ఇక మరో రెండు
రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో ఫలితం తేలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇండియా టీంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్
బుమ్రా ఇటు బ్యాట్తోనూ, అటు బాల్తోనూ ఈ సారి రాణించాడు. ఫస్ట్క్లాస్
క్రికెట్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన బుమ్రా 55 పరుగులతో ఇండియన్ టీమ్లో టాప్ స్కోరర్గా
వున్నాడు. తర్వాత ఆస్ట్రేలియా పై బౌలింగ్లోనూ 2 వికెట్లు పడగొట్టాడు. 3
వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమికి మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఎ
బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు.
ఈసారి పింక్ బాల్
వాడడంతో ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్
బాల్ కాస్త ఎక్కువగానే స్వింగ్ అవడంతో రెండు జట్ల బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది
పడ్డారు. అంతకుముందు టీమిండియా కూడా 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా చివరి వికెట్కు సిరాజ్ (22)తో కలిసి
బుమ్రా 71 పరుగులు
జోడించాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్లో
జరిగే మొదటి టెస్ట్ ఈ నెల 17న తొలి డేనైట్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్తో టీమిండియా గట్టి
సందేశాన్నే ఆస్ట్రేలికు అందించింది.