ఈ ఓటమే రాబోయే రోజుల్లో మాకు విజయాలను చేకూరుస్తుంది ...కెప్టెన్ విరాట్ కోహ్లీ
By: Sankar Wed, 02 Dec 2020 8:44 PM
ఆస్ట్రేలియా లో సిరీస్ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది అని అన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..మూడో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా మ్యాచ్ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.మా పర్యటన ఇక్కడితో ముగిసిపోలేదు. రానున్న రోజుల్లో మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒక కెప్టెన్గా వన్డే సిరీస్ ఓడిపోవడం నిరాశను కలిగించింది. అయినా ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి మాకు ఒక గుణపాఠం కానుంది.
మ్యాచ్ ఆడేటప్పుడు మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తామని మూడో వన్డేలో విజయం ద్వారా మాకు అర్థమైంది. ఎప్పుడైనా ఆటలో దెబ్బలు తగిలితేనే గాయం విలువేంటో తెలుస్తుంది.. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. అలాగే సిరీస్ ఓడిపోయినంత మాత్రానా మేము పూర్తిగా కోల్పోయినట్లు కాదు. ఈ ఓటమే రానున్న మ్యాచ్ల్లో మాకు విజయాలను సమకూరుస్తుందని ఆశిస్తున్నా అని అన్నాడు
కాగా కోహ్లి ఈ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 302 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 92, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది.