Advertisement

  • ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ పట్టు నిలుపుకున్న కోహ్లీ , రోహిత్

ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ పట్టు నిలుపుకున్న కోహ్లీ , రోహిత్

By: Sankar Thu, 10 Dec 2020 6:34 PM

ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ పట్టు నిలుపుకున్న కోహ్లీ , రోహిత్


ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మరొకసారి తమ సత్తా చాటారు ..గత కొంతకాలంగా వన్ డే ర్యాంకింగ్స్ లో తమ ఆధిపత్యాన్ని చూపుతున్న ఇండియా కెప్టెన్ కోహ్లీ , వైస్ కెప్టెన్ రోహిత్ లు వరుసగా ఒకటి , రెండు స్థానాలను నిలుపుకున్నారు..గాయం కారణంగా ఆసీస్‌ టూర్‌కు దూరంగా ఉ‍న్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు..

ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముజీబుర్‌ రెహమాన్‌ 701 పాయింట్లతో రెండో స్థానం.. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక ఆసీస్ టూర్ లో బ్యాటింగ్ లో చెలరేగి ఆడిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కెరీర్ లో తొలిసారిగా టాప్ ఫిఫ్టీ ర్యాంకింగ్ లోకి అడుగుపెట్టాడు...ప్రస్తుతం 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్‌లో కెరీర్‌ బెస్ట్‌ చేరుకున్నాడు.

Tags :
|
|

Advertisement