Advertisement

  • ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ..తుది జట్టును ప్రకటించిన టీమిండియా

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ..తుది జట్టును ప్రకటించిన టీమిండియా

By: Sankar Wed, 16 Dec 2020 4:07 PM

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ..తుది జట్టును ప్రకటించిన టీమిండియా


ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీం ఇండియా రేపటి నుంచి నాలుగు టెస్టుల సిరీస్ లో బరిలోకి దిగుతుంది..రేపు అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది...అయితే ఒకరోజు ముందుగానే టీం ఇండియా తుది జట్టును ప్రకటించింది..స్టార్ ఓపెనర్ రోహిత్ లేకపోవడంతో ఓపెనర్ గా ఎవరు వస్తారు అని పెద్ద చర్చే జరిగింది ..అయితే కరోనా కు ముందు న్యూజిలాండ్ సిరీస్ లో ఓపెనర్లు గా బరిలోకి దిగిన పృథ్వీ షా , మయాంక్ అగర్వాల్ ల మీదనే టీం ఇండియా నమ్మకం ఉంచింది...

కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు వహించనున్న ఈ మ్యాచ్ కు రహానే వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. గత పర్యటనలో చెలరేగిన పుజారా తో పాటుగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి కూడా ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ కు ఎంపికయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా సాహానే వ్యవరించనున్నాడు.

అయితే స్పిన్నర్ గా కేవలం రవిచంద్రన్ అశ్విన్ ను మాత్రమే ఎంపిక చేయగా పేసర్లు గా ఉమేష్ యాదవ్, షమీ, బుమ్రా లను ఎంపిక చేసారు. అయితే సూపర్ ఫాంలో ఉన్నప్పటకీ కేఎల్ రాహుల్ తుది జ్టట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.జడేజా , రాహుల్ , సిరాజ్ ,నవదీప్ సైనీ లు రిజర్వు లో ఉన్నారు...

Tags :

Advertisement