కుప్పకూలిన లోయర్ ఆర్డర్ ..కేవలం 11 పరుగులకే నాలుగు వికెట్లు
By: Sankar Fri, 18 Dec 2020 11:05 AM
ఆసీస్తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయింది. 233/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన క్రితం రోజు స్కోరుకు మరో 11 పరుగులు మాత్రమే జత చేసింది.
అశ్విన్, సాహాలు క్రీజులో ఉండడంతో టీమిండియా 300 మార్కును సులభంగా దాటుందని అంతా భావించారు. కానీ పిచ్పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న స్టార్క్, కమిన్స్లు రెచ్చిపోయారు. రెండో రోజు కమిన్స్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే రవిచంద్రన్ అశ్విన్(15 పరుగులు) క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు.
తర్వాతి ఓవర్లో 9 పరుగులు చేసిన సాహాను స్టార్క్ పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఉమేశ్ యాదవ్, షమీలు వీరిద్దరి దాటికి ఎక్కువసేపు నిలవలేకపోయారు.దీనితో టీమిండియా 250 పరుగుల లోపే ఆల్ అవుట్ అయింది