Advertisement

వీర జవాన్లకి టీమిండియా క్రికెటర్లు నివాళులు

By: Sankar Wed, 17 June 2020 8:36 PM

వీర జవాన్లకి టీమిండియా క్రికెటర్లు నివాళులు



లఢక్‌లోని గాల్వన్ లోయలో మంగళవారం అమరులైన భారత వీర జవాన్లకి టీమిండియా క్రికెటర్లు నివాళులు అర్పించారు. సరిహద్దు వద్ద గస్తీకాస్తున్న భారత సైనికులపై ఆకస్మికంగా చైనా సైనికులు దాడి చేయడంతో.. 20 మంది వీరమరణం పొందారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. దాంతో.. వీర జవాన్లకి భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తదితరులు నివాళులు అర్పించారు.

భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు వద్ద.. గత కొంతకాలంగా ఇరు దేశాల సైనికులు ఘర్షణకి దిగుతున్నారు. తాజాగా రాత్రి సమయంలో భారత బలగాలు మన భూభాగంలోనే గస్తీ నిర్వహిస్తుండగా.. దాదాపు 1000 మంది చైనా సైనికులు ఒక్కసారి దాడికి దిగినట్లు తెలుస్తోంది. కర్రలు, ఇనుప కడ్డీలతో వారు దాడికి దిగినప్పటికీ.. భారత సైనికులు వీరోచితంగా పోరాడారు.

రాత్రి సమయంలో కొన్ని గంటల పాటు జరిగిన ఈ పోరాటం భారత సైనికులు 20 మంది వీర మరణం పొందగా.. చైనా సైనికులు 40 మందిపైనే చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ.. చైనా మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. పైపెచ్చు భారత సైనికులే తొలుత దాడికి దిగారంటూ బుకాయిస్తోంది.

Tags :
|

Advertisement