Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికల వేళ ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు

జిహెచ్ఎంసి ఎన్నికల వేళ ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు

By: Sankar Mon, 30 Nov 2020 12:54 PM

జిహెచ్ఎంసి ఎన్నికల వేళ ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు


జిహెచ్ఎంసి లో ఎన్నికలకు ప్రచారం నిన్నటి సాయంత్రంతో ముగిసింది ...రేపు ఎన్నికలు జరగనున్నాయి..అన్ని పార్టీలు కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను చేసాయి...ఇంతకుముందు గ్రేటర్ ఎన్నికలు అంటే ఎక్కువగా కాంగ్రెస్ , టిడిపి మధ్య పోటీ ఉండేది ..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు...తెలంగాణాలో టిడిపి తన మనుగడను దాదాపుగా కోల్పోయింది..అయినా కూడా ఈ గ్రేటర్ ఎన్నికలలో టిడిపి పోటీ చేస్తుంది...

ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌ ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశాడు. "హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజా శ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్. సాప్ట్ వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచి. అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పాల్సి ఉంటుంది.

మాటలకన్నా చేతల్లోనే మేం చూపాం.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి ప్రముఖులను రప్పించి భావితరానికి బాటలు వేయగలిగాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమం.. ఇవే లక్ష్యంగా ముందుకు సాగాం. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు మా తెలుగు దేశానివే అని సగర్వంగా చెప్పగలం. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి." అంటూ చంద్రబాబు కోరారు.

Tags :
|
|

Advertisement