Advertisement

  • సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే ...చంద్రబాబు

సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే ...చంద్రబాబు

By: Sankar Thu, 12 Nov 2020 5:34 PM

సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే ...చంద్రబాబు


కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలుగుదేశం అధినేత చంద్ర బాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదన్న ఆయన తమ ఆస్తులకు భద్రత లేదని ప్రజలు గోడు పెడుతుంటే పట్టించుకోని ముుఖ్యమంత్రికి కళ్లు చెవులున్నాయా? అని ప్రశ్నించారు. ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని కారకులైన అధికారుల్ని డిస్మిస్ చేయాలని అయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు.

సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతూ ఆత్మహత్యలను ప్రేరేపిస్తోందని అన్నారు. సమాజానికి నమ్మకం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించలేకపోతే ఇంకా ఈతరహా ఘటనలు ఇంకా పెరిగిపోతాయని ఆయన అన్నారు.

Tags :

Advertisement