Breaking: కరోనా మహమ్మారి: టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం విషమం...!
By: Anji Sun, 06 Dec 2020 11:16 AM
కరోనా మహమ్మారి దెబ్బకు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు విడువగా..కొంతమంది కరోనా నుండి బయటపడుతున్నారు.
అయితే అల బయటపడిన కొంతమందికి మరోసారి కరోనా సోకుతుంది. అల రెండో సారి కరోనా వచ్చిన వారు ప్రాణాలతో బయటపడలేకపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం సైతం అలాగే ఉంది.
బచ్చుల అర్జునుడు రెండో సారి కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. డిసెంబరు 2 కోవిడ్ నిర్ధారణ కావడంతో విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో తొలుత చికిత్స కోసం చేరారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
అక్కడ చేరిన తర్వాత కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గతంలో కరోనా నుంచి కోలుకున్న ఆయనకు మరోసారి వైరస్ సోకింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా రెండోసారి సోకడం ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మరోసారి కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.