జగన్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే చందన రమేష్
By: chandrasekar Sat, 22 Aug 2020 7:15 PM
టీడీపీకి చెందిన ఎమ్మెల్యే చందన రమేష్ ప్రస్తుతం జగన్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ లోకి వలసలు మళ్లీ మొదలయ్యాయి. మొన్నటి వరకు చేరికలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అధిష్టానం మళ్లీ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. తాజాగా మరో కీలక నేత అధికార పార్టీలో చేరారు. టీడీపీకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ షాకిచ్చారు.
తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రమేష్ను జగన్ సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. చందన రమేష్ 2009లో కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ టీడీపీలోనే కొనసాగారు.
ఈయనగారు
2019 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై పోటీచేసి విజయం సాధించారు. కానీ చందన రమేష్ తెలుగు దేశం పార్టీలోనే ఇన్ని రోజులు కొనసాగారు. కొద్దిరోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్య పరిచారు.