టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్
By: chandrasekar Wed, 17 June 2020 1:52 PM
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ
సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కానీ
టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కక్షసాధింపు, వేధింపులు
అంటూ నినాదాలు చేశారు. సభలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని
మండిపడ్డారు. దీనికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామన్నారు.
మండలిలో టీడీపీ
ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం అబద్దాలు అని అక్రమ అరెస్టులు
ఆపాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేసి వాకౌట్
చేశారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీపీఈ కిట్ ధరించి సభకు
రావడం విశేషం. కరోనా భయంతో ఆయన ఈ జాగ్రత్త తీసుకున్నారట.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అసెంబ్లీ రావడానికి ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు
హాజరయ్యారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తాజా పరిణామాలపై
ఇలా నిరసన తెలిపారు. అసెంబ్లీ రెండు రోజుల పాటూ సాగనుండగా టీడీపీ మాత్రం కనీసం 15
రోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.