వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు
By: chandrasekar Thu, 11 June 2020 5:11 PM
ప్రతిపక్ష పార్టీ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ వరుసలో టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలకనేత, మాజీ శిద్ధా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు ఇద్దరికీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో కీలకనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం ప్రతిపక్షానికి నిజంగానే ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. శిద్దా రాఘవ రావు వైసీపీలోకి చేరిన ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.